విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. తొలి సమీక్షకే డుమ్మా కొట్టిన ఆ శాఖ కొత్త మంత్రి బొత్స

Botsa Absent For CM Jagan Review On Education Dept
  • పరీక్షలు, ఏర్పాట్లపై అధికారులతో జగన్ చర్చ
  • సమీక్షకు రాలేకపోతున్నానన్న బొత్స
  • సోదరుడి కుమార్తె పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నానని వివరణ 
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏపీ సీఎం జగన్ తొలిసారిగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు, పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి ఆ శాఖ అధికారులతో చర్చించారు. అయితే, ఆ సమీక్షకు విద్యాశాఖ కొత్త మంత్రి అయిన బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టారు. ఆయనకు అది తొలి సమీక్షే అయినా గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. 

అయితే, సమీక్షకు రాలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి బొత్స ముందే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. తన సోదరుడి కుమార్తె వివాహ పనుల్లో కొంచెం బిజీగా ఉన్నానని, అందుకే సమీక్షకు రాలేకపోతున్నానని ఆయన ముందే చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
Andhra Pradesh
YS Jagan
YSRCP
Botsa Satyanarayana
Botsa

More Telugu News