7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజలను మోసం చేశారు: అయ్య‌న్న పాత్రుడు

ayyanna slams jagan
  • పేద ప్రజల నడ్డివిరిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచారు
  • తక్షణమే ప్రభుత్వం ఉపసంహ‌రించుకోవాలన్న అయ్యన్న  
  • బుధవారం సాయంత్రం ర్యాలీ చేప‌డ‌తామని వెల్లడి 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని చెప్పారు. దీనిపై ఎల్లుండి నిర‌స‌న తెలుపుతున్నామ‌ని ప్ర‌క‌టిస్తూ ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. 

'జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి అడ్డగోలుగా ప్రజల్ని మోసం చేశారు. పేద ప్రజల నడ్డివిరిచేలా పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ప్రభుత్వం ఉపసంహ‌రించుకోవాలని బుధవారం సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నం శ్రీకన్య కూడలి నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాము. ప్రజలు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని అయ్య‌న్న పాత్రుడు పేర్కొన్నారు. 
Go Back to Shorts
Ayyanna Patrudu
Telugudesam
YSRCP

More Telugu News