ప్ర‌ధానికి లేఖ రాయ‌డం త‌ప్పా?.. లోక్‌స‌భ‌లో ర‌ఘురామకృష్ణరాజు

raghurama krishna raju fires on ysrcp in lok sabha
  • ఏపీ మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించిన ఎంపీ
  • ఆ నివేదిక‌ను ప్ర‌ధానికి పంపిన వైనం
  • ల్యాబ్ టెస్టులు, నివేదిక‌పై ఏపీ ప్ర‌భుత్వం ఆగ్ర‌హం
  • ఇదేం ప‌ద్ద‌తి? అంటూ పార్ల‌మెంటులో ర‌ఘురామ‌రాజు ప్రశ్న  
ఏపీ ప్ర‌భుత్వం అమ్ముతున్న మ‌ద్యం నాణ్య‌తపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసిన త‌న‌పై వైసీపీ స‌ర్కారు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు లోక్ సభలో అన్నారు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధిగా, పార్ల‌మెంటు స‌భ్యుడిగా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ‌తోనే తాను ప్ర‌ధానికి లేఖ రాశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ మేర‌కు ప్ర‌ధానికి లేఖ రాశాన‌న్న కార‌ణంతో త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేందుకు ఏపీ ప్ర‌భుత్వం య‌త్నిస్తోంద‌ని ర‌ఘురామ‌రాజు లోక్ స‌భ‌లో ప్ర‌స్తావించారు.

బుధ‌వారం నాటి లోక్ స‌భ స‌మావేశాల్లో ఈ అంశాన్ని లేవ‌నెత్తిన ర‌ఘురామ‌రాజు.. మ‌ద్యం నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయించ‌డం త‌ప్పా? లేదంటే ఆ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌ధానికి తెలియ‌జేయ‌డం త‌ప్పా? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మాత్రం దానికి త‌న‌పై క్రిమిన‌ల్ కేసులు అని, ప‌రువు న‌ష్టం దావా అని వైసీపీ స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
Lok Sabha
Andhra Pradesh

More Telugu News