కేసీఆర్‌కు పుష్పగుచ్చం పంపిన గవర్నర్ తమిళిసై

Tamilisai sends flower bouquet to KCR
  • స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్
  • వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
  • కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానన్న గవర్నర్
అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. నిన్న ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించిన యశోదా ఆసుపత్రి వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరోవైపు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు. ఆయనకు పుష్పగుచ్ఛం పంపించారు. సీఎంగారు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానని పుష్పగుచ్ఛంతో పాటు పంపిన లేఖలో తమిళిసై పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని చెప్పారు. 

మరోవైపు బీబీనగర్ లోని ఎయిమ్స్ లో జరిగిన 2021-22 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థుల వైట్ కోట్ సెరమొనీ కార్యక్రమానికి గవర్నర్ హాజరయ్యారు. అక్కడ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య వృత్తి కష్టమైనా డిప్రెషన్ కు గురి కావద్దని విద్యార్థులకు సూచించారు. వైద్య సేవలు అందించడం కష్టమైనా జాగ్రత్తగా పని చేయాలని చెప్పారు. వైద్య విద్యార్థులు పరిశోధన, విద్య, ఆటలతో పాటు అన్ని రంగాల్లో పాల్గొంటూ సంతోషంగా వైద్య విద్యను అభ్యసించాలని అన్నారు.
Go Back to Shorts
Tamilisai Soundararajan
KCR
TRS

More Telugu News