మూడు జిల్లాల్లో కేసుల్లేవ్‌.. ఏపీ క‌రోనా అప్‌డేట్స్ ఇదిగో

ap corona cases and updates
  • గత 24 గంటల్లో 7,969 కరోనా పరీక్షలు
  • 71 కొత్త కేసుల న‌మోదు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 2,325 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి కనిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 7,969 శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా 71 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 22, గుంటూరు జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, క‌ర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. ఇలా కొత్త కేసులు న‌మోదు కాని జిల్లాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

అదే సమయంలో 595 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,812 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,00,760 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,325 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,727కి పెరిగింది.

.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus

More Telugu News