కేంద్ర స‌ర్వీసుల‌కు ఏపీ ఐఏఎస్ శ్రీకాంత్‌

  • సీఆర్డీఏ తొలి క‌మిష‌న‌ర్‌గా మంచి గుర్తింపు
  • ప్ర‌స్తుతం ఏపీ ఇంధ‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు
  • సెంట్ర‌ల్ కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్‌లో కొత్త పోస్టింగ్
  • ఐదేళ్ల పాటు అదే పోస్టులో కొన‌సాగ‌నున్న శ్రీకాంత్‌
ఏపీ కేడ‌ర్‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి నాగులాప‌ల్లి శ్రీకాంత్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లిపోతున్నారు. ప్ర‌స్తుతం ఏపీ ఇంధ‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తిస్తున్న శ్రీకాంత్ స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గ‌తంలో సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌గా శ్రీకాంత్ మెరుగైన ప‌నితీరును క‌న‌బ‌ర‌చారు.

కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్ల‌నున్న శ్రీకాంత్‌కు ఇప్ప‌టికే పోస్టింగ్ కూడా ఖ‌రారైంది. ఏపీ నుంచి రిలీవ్ అయి ఢిల్లీకి వెళ్లిన వెంట‌నే ఆయ‌న సెంట్ర‌ల్‌ కేబినెట్ సెక్ర‌టేరియ‌ట్‌లో జాయింట్ సెక్ర‌ట‌రీగా విధుల్లో చేరిపోనున్నారు. ఈ పోస్టులో ఆయ‌న ఐదేళ్ల పాటు కొన‌సాగ‌నున్న‌ట్లుగా స‌మాచారం.
Go Back to Shorts
ap ias officer
srikanth nagulapalli
crda commissioner

More Telugu News