తెలంగాణలో ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Local body MLC elections polling concludes
  • 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్
  • 5 జిల్లాల పరిధిలో ఎన్నికలు
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్
  • ఈ నెల 14న ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు సమాప్తమైంది. కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు.

5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా, నాలుగు ఓట్లు తప్ప మిగతావి అన్నీ పోలయ్యాయి.
Go Back to Shorts
MLC Elections
Polling
Telangana
Local Body

More Telugu News