ఏపీలో మరో 222 మందికి కరోనా

AP Corona Cases media bulletin
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 31,473 కరోనా టెస్టులు
  • గుంటూరు జిల్లాలో 38 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 2,560 మందికి చికిత్స
ఏపీలో కరోనా వ్యాప్తి ఏమంత ఉద్ధృతంగా లేకపోయినా, పాజిటివ్ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 31,473 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 222 మందికి పాజిటివ్ గా తేలింది. గుంటూరు జిల్లాలో 38, విశాఖ జిల్లాలో 35, కృష్ణా జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 28, నెల్లూరు జిల్లాలో 24 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.

అదే సమయంలో 275 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,70,738 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,53,755 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,560 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించినవారి సంఖ్య 14,423కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Bulletin
Today Cases

More Telugu News