చివరి షెడ్యూల్లో 'సర్కారువారి పాట'

Sarkaru Vaari Paata movie update
  • స్పెయిన్ లో పూర్తయిన షెడ్యూల్
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగు
  • ప్రధాన పాత్రల కాంబినేషన్లో చిత్రీకరణ
  • ఏప్రిల్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ .. 14 రీల్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా, చిత్రీకరణపరంగా ముగింపు దశకు చేరుకుంది.

ఇంతవరకూ దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో ఈ సినిమా షూటింగు జరుపుకుంది. దుబాయ్ .. గోవా షెడ్యూల్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్పెయిన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను చిత్రీకరించారు. ఇక ఫైనల్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ ఈ షెడ్యూల్ నడుస్తుందట. ప్రధానమైన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విడుదల తేదీ జనవరి 13 నుంచి ఏప్రిల్ 1కి వెళ్లడం వలన, కూల్ గానే షూటింగు చేస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Mahesh Babu
Keerthy Suresh
Parasuram

More Telugu News