ఏపీలో కొత్తగా 478 మందికి కరోనా నిర్ధారణ

AP Corona daily media report
  • గత 24 గంటల్లో 43,494 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 119 కొత్త కేసులు
  • కర్నూలు జిల్లాలో నలుగురికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • ఇంకా 5,398 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 43,494 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 478 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 119 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 96, గుంటూరు జిల్లాలో 60 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 574 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,781 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,43,050 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,398 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,333కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Media Report
Daily Cases

More Telugu News