తెలంగాణలో మరో 214 మందికి కరోనా పాజిటివ్

Telangana corona cases and recoveries
  • గత 24 గంటల్లో 46,190 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 64 కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 4,624 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 46,190 కరోనా పరీక్షలు నిర్వహించగా, 214 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 16, నల్గొండ జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,65,963 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,57,421 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,624 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,918కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Today Cases
Update

More Telugu News