ఏపీలో రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

AP Corona Cases daily bulletin
  • గత 24 గంటల్లో 91,677 కరోనా పరీక్షలు
  • 2,665 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 529 కేసులు
  • కర్నూలు జిల్లాలో 33 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో 16 మంది మృతి
ఏపీలో కరోనా రోజువారీ కేసుల తాజా బులెటిన్ విడుదలైంది. గడచిన 24 గంటల్లో 91,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,665 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 529 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 33 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 353, పశ్చిమ గోదావరి జిల్లాలో 293, ప్రకాశం జిల్లాలో 285 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,231 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,22,843 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,81,161 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 28,680 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,002కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
New Cases
Deaths
Daily Bulletin

More Telugu News