ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. 3 వేల దిగువకు కొత్త కేసులు

AP records below 3000 corona cases in 24 hours
  • 24 గంటల్లో 2,925 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది మృతి
  • రాష్ట్రంలో 29,262 యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 2,925 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 611 కేసులు నమోదు కాగా... విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 32 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి కారణంగా 26 మంది మృతి చెందారు. 3,937 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,20,178కి పెరిగింది. 18,77,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,986 మంది చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,28,94,611 శాంపిల్స్ ని పరీక్షించారు.

.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Cases

More Telugu News