ఏపీలో కరోనా కొత్త కేసులు 3,040 ... పూర్తి వివరాలు ఇవిగో!

AP records 3040 Corona cases in 24 hours
  • తూర్పుగోదావరి జిల్లాలో 659 కేసుల నిర్ధారణ
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 45 కేసులు 
  • రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి
గత 24 గంటల్లో ఏపీలో 3,040 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 659 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 45 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మృతి చెందారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 4,576 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,17,253కి చేరుకోగా... మొత్తం 18,73,993 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,960 మంది మృతి చెందారు. ప్రస్తుతం 30,300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus

More Telugu News