ఏపీలో కొత్తగా 3,042 కొవిడ్ కేసులు

AP Corona health bulletin details
  • గత 24 గంటల్లో 88,378 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 665 కేసులు
  • కర్నూలు జిల్లాలో 51 కేసులు
  • రాష్ట్రంలో 28 మంది మృతి
  • ఇంకా 33,230 మందికి చికిత్స
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మరింత నెమ్మదించింది. గడచిన 24 గంటల్లో 88,378 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 665 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 51 కేసులు గుర్తించారు. పశ్చిమ గోదావరిలో 360, చిత్తూరు జిల్లాలో 358, ప్రకాశం జిల్లాలో 310 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,748 మంది కరోనా నుంచి కోలుకోగా, 28 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 19,08,065 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,61,937 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,230 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,898కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Bulletin
Details

More Telugu News