ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు: అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం

atchannaidu slams jagan
  • పొలాల మీదుగా విద్యుత్ లైన్లు వేస్తున్నారు
  • కంభంపాడులో జ‌రిగిన‌ ఘటన స‌రికాదు
  • ప్రతిపక్షాలను వేధించడంపైనే రాష్ట్ర‌ ప్రభుత్వం దృష్టి  
వైసీపీపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. అక్ర‌మంగా కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు.  పొలాల మీదుగా విద్యుత్ లైన్లు వేస్తున్నార‌ని, పంట‌ల‌ను నాశనం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌శ్నించిన వారిపై కేసులు పెడుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడులో జ‌రిగిన‌ ఘటన స‌రికాద‌ని చెప్పారు.

రాష్ట్రంలో పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్ట‌డం కంటే, ప్రతిపక్షాలను వేధించడంపైనే రాష్ట్ర‌ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయ‌న ఆరోపించారు. అక్ర‌మాల‌ను ప్ర‌శ్నిస్తోన్న త‌మ పార్టీ శ్రేణులపై అక్ర‌మ‌ కేసులు పెడితే ఊరుకోబోమ‌ని చెప్పారు. పోలీసులు ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరు స‌రికాద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అరెస్టు చేసిన త‌మ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు.



Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Andhra Pradesh

More Telugu News