అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చేరిన వీహెచ్‌

vh joins in hospital
  • హైద‌రాబాద్‌లోని ఆసుప‌త్రిలో చికిత్స‌
  • కొంత‌ కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు
  • ఈ నేప‌థ్యంలోనే అనారోగ్యం?
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. కొంత‌ కాలంగా ఆయ‌న‌ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనారోగ్యానికి గురైన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. వీహెచ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఆకాంక్షిస్తున్నారు. కాగా, గ‌త ఏడాది వీహెచ్‌కు క‌రోనా సోక‌గా ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
VH
Congress
Hyderabad

More Telugu News