ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,617 కరోనా కేసుల నమోదు

57 Corona deaths in AP in last 24 hours
  • రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది మృతి  
  • ఇప్పటి వరకు మొత్తం 12,109 మంది మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 71,466
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,617 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,397 కేసులు నమోదు కాగా... అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 18,26,751 మంది కరోనా బారిన పడ్డారు. 17,43,176 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,109 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News