ఏపీలో మరో 12,768 మందికి కరోనా.. పూర్తి అప్ డేట్స్!

AP records more than 12000 Corona cases in 24 hours
  • తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,703 కేసుల నమోదు
  • రాష్ట్ర వ్యాప్తంగా 98 మంది మృతి
  • ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,795
ఏపీలో కారోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 98,048 మందిని పరీక్షించగా వారిలో 12,768 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,703 మంది కరోనా బారిన పడ్డారు. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 253 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 98 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 15,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 17,17,156కి చేరుకోగా... 15,62,229 మంది కోలుకున్నారు. మొత్తం 11,132 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News