ఎన్టీఆర్‌కు భార‌త‌రత్న ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం: చిరంజీవి

chiru tweet about ntr
  • భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు
  • అలాగే ఎన్టీఆర్‌కూ ఇవ్వాలి
  • ఎన్టీఆర్ నూర‌వ జ‌యంతి ద‌గ్గ‌ర ప‌డుతోంది 
  • 98వ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా స్మ‌రించుకుంటున్నాను
ఎన్టీఆర్ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న‌ను మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆయ‌న‌కు భార‌త ర‌త్న ఇవ్వాల‌ని అన్నారు.  ప్రముఖ గాయకుడు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లు మ‌న తెలుగు తేజం, దేశం గ‌ర్వించే నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావుగారికి భార‌త‌రత్న ఇస్తే అది తెలుగు వారంద‌రికీ గ‌ర్వ కార‌ణమ‌ని చిరంజీవి పేర్కొన్నారు.

నూర‌వ జ‌యంతి ద‌గ్గ‌ర ప‌డుతున్న సంద‌ర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌర‌వం ద‌క్కితే అది తెలుగు వారికి ద‌క్కే గౌర‌వం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆ మ‌హానుభావుడి 98వ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా స్మ‌రించుకుంటున్నాన‌ని చెప్పారు. కాగా, ఎన్టీఆర్‌కు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.  
Go Back to Shorts
Chiranjeevi
ntr
Tollywood

More Telugu News