పాన్ ఇండియా స్థాయిలోనే త్రివిక్రమ్ మూవీ!

Trivikram latest movie update
  • మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ
  • పరిశీలనలో 'పార్థు' టైటిల్
  • ఇద్దరు కథానాయికలకు ఛాన్స్
  • త్వరలోనే సెట్స్ పైకి
త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. మహేశ్ బాబు కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాను, హారిక అండ్ హాసిని బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రమే అయినా, తెలుగులో మాత్రమే విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ సినిమాకి 'పార్థు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు  అవకాశం ఉందట. ఒక కథానాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకోవటానికి గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఒకవేళ కుదరకపోతే మాత్రం రెండవ కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టు పైకి రానున్నాడు.
Go Back to Shorts
Trivikram Srinivas
Mahesh Babu
Pooja Hegde

More Telugu News