సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Nitya Menon to play love interest for Pawan
  • పవన్ రీమేక్ సినిమాలో నిత్య మీనన్ 
  • కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన రవితేజ
  • సంక్రాంతికి రానున్న మణిరత్నం చిత్రం
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. ఇందులో ఆయన సరసన నిత్య మీనన్ ని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో జంటగా రానా, ఐశ్వర్య రాజేశ్ నటిస్తారు.
*  ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్న రవితేజ దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేస్తాడు. ఆ తర్వాత ప్రాజక్టును ఓ కొత్త దర్శకుడితో  చేస్తాడని సమాచారం. దీనిని 'విరాటపర్వం' నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు.  
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం ఇప్పటికి 70 శాతం షూటింగును పూర్తిచేసుకుంది. వచ్చే సంక్రాంతికి దీనిని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Nitya Meenan
Pawan Kalyan
Raviteja
Maniratnam

More Telugu News