దేశంలో మ‌ళ్లీ 53 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు!

  Media Bulletin on status of positive cases COVID19 in india
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534
  • మృతుల సంఖ్య 1,60,692
  • 5,31,45,709 మందికి వ్యాక్సిన్లు
  • 23,75,03,882 కరోనా పరీక్షలు
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మొన్న 47,262 మందికి కరోనా నిర్ధారణ కాగా, గ‌త 24 గంటల్లో 53,476 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 26,490 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 251 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,60,692కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,12,31,650 మంది కోలుకున్నారు. 3,95,192 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 5,31,45,709 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,75,03,882 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,65,021 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News