తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Tirupati by polls notification released
  • బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నికలు
  • ఈ నెల 30 వరకు నామినేషన్లు
  • 31న నామినేషన్ల పరిశీలన
  • ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణలకు అవకాశం
  • ఏప్రిల్ 17న పోలింగ్
  • మే 2న ఓట్ల లెక్కింపు
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.  నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3న తుదిగడువు. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

కాగా, తిరుపతి పార్లమెంటు స్థానం బరిలో అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని రంగంలోకి దించగా, టీడీపీ కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని పోటీకి నిలిపింది. బీజేపీ-జనసేన కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Tirupati LS Bypolls
Notification
Elections
Nominations

More Telugu News