తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • 24 గంటల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118
  • మృతుల సంఖ్య 1,669
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా
తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య మ‌రింత‌ పెరిగిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కొత్త‌గా 394 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 194 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,118 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,645 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,669గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 2,804 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,123 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 81 మందికి క‌రోనా సోకింది.
  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News