భార‌త్‌లో కొత్త‌గా 15,388 మందికి కరోనా నిర్ధారణ

India reports 15388 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786
  • మృతుల సంఖ్య 1,57,930
  • కోలుకున్న వారు 1,08,99,394 మంది
  • మొత్తం 22,27,16,796 కరోనా పరీక్షలు  
భార‌త్‌లో గత 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం...  16,596 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,12,44,786కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,27,16,796 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,48,525 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
India

More Telugu News