తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్!

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • కొత్తగా 267 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,92,395
  • మృతుల సంఖ్య 1,583  
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 55 కేసులు  
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 267 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 351 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,92,395 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,86,893 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,583 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,919 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  2,270 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 55 కరోనా కేసులు నమోదయ్యాయి.  

   
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News