ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు

Corona cases in AP decreased drastically
  • గత 24 గంటల్లో 238 పాజిటివ్ కేసుల నమోదు
  • ఇదే సమయంలో ముగ్గురి మృతి
  • రాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,194
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య మరింతగా తగ్గింది. గత 24 గంటల్లో 48,518 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా వీరిలో 238 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీటిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 59 కేసులు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యల్పంగా 4 కేసులు నమోదయ్యాయి.

ఇదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. గత 24 గంటల్లో 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 7,111 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 8,82,850కి చేరుకుంది.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
Updates

More Telugu News