ఈసారి పోలెండ్ లో ప్రత్యక్షమైన మిస్టరీ దిమ్మె!

Mystery monolith appears this time in Poland
  • వార్సాలోని విస్టులా నదీ తీరంలో దిమ్మె
  • దిమ్మెను గుర్తించిన పౌరుడు
  • ఇది అసాధారణంగా ఉందన్న అధికార యంత్రాంగం
  • ఇప్పటికే పలు దేశాల్లో లోహపు దిమ్మెల ప్రత్యక్షం
  • కొన్నిరోజులకే మాయమవుతున్న వైనం
గత కొన్నిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ప్రత్యక్షమవుతున్న లోహపు దిమ్మెల మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. తాజాగా ఓ లోహపు దిమ్మె పోలెండ్ లో ప్రత్యక్షమైంది. పోలెండ్ రాజధాని నగరం వార్సాలోని విస్టులా నదీతీరం వద్ద ఇది దర్శనమిచ్చింది. నదీ తీరం వెంబడి ఉదయపు పరుగు కోసం వెళ్లిన ఓ వ్యక్తి ఈ ముక్కోణాకారపు దిమ్మెను గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. పది అడుగుల ఎత్తున్న ఈ దిమ్మె వెండి రంగులో కనిపించింది. ఈ లోహపు ఆకారాన్ని ఎవరు అక్కడ పాతి ఉంటారన్న దానిపై ఇంతవరకు సమాచారం లేదు.

దీనిపై విస్టులా జిల్లా అధికార యంత్రాంగం ఫేస్ బుక్ లో స్పందించింది. తీరంలో అసాధారణరీతిలో ఉన్న ఓ మిస్టరీ దిమ్మె కనిపించిందని, విస్టులా నదీతీరానికి విహారానికి వచ్చేవాళ్లు దీన్ని చూడకుండా ఉండలేరని పోస్టు చేసింది.

ఇలాంటి దిమ్మె మొట్టమొదట అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో గుర్తించారు. కొన్నిరోజులకే అది అక్కడ్నించి మాయమైంది. ఆ తర్వాత యూరప్ లోని పలుదేశాల్లోనూ, దక్షిణ అమెరికా దేశాల్లోనూ ఇలాంటివే కనిపించడం, కొన్నిరోజులకే మాయం కావడం జరుగుతోంది. ఇది గ్రహాంతరజీవుల పనే అని వాదనలు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Monolith
Poland
Warsaw
Vistula River
Mystery

More Telugu News