ఎన్నికల తరువాత తొలిసారి ప్రజల మధ్యకు వచ్చిన ట్రంప్... మళ్లీ అదే పాత పాట!

Trump Says He is the Real Winner
  • జనవరి 5న స్పెషల్ సెనెట్ ఎన్నికలు
  • మోసం చేసే బైడెన్ గెలిచారు
  • తానే అసలైన విజేతనన్న ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం అనంతరం డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడారు. తన ప్రసంగంలోనూ ఆయన పాత పాటే పాడారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు మోసం చేసి గెలిచారని ఆరోపించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, అందుకే బైడెన్ గెలిచాడని విమర్శలు గుప్పించారు.

తాను నిజంగా ఓటమిపాలై ఉంటే, తానే స్వయంగా అంగీకరించి, ఇంటికి వెళ్లి పోయి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో అసలైన విజేతను తానేనని, కుట్రతోనే బైడెన్ గెలిచాడని ట్రంప్ ఆరోపించారు. జనవరి 5న స్పెషల్ సెనెట్ ఎన్నికలు జరుగనుండగా, రిపబ్లికన్ల తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు.
Go Back to Shorts
Donald Trump
Elections
Joe Biden

More Telugu News