కట్టు కథలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నాడు: విజయసాయిరెడ్డి

vijaya sai slams chandrababu
  • జూమ్ మీటింగులకు అలవాటు పడ్డాడు
  • అసెంబ్లీ సమావేశాల్లో లోపలి కంటే బయటే ఎక్కువ గడిపాడు
  • అను ‘కుల మీడియా కొంగు చాటున దాక్కునే రోజులు పోయాయి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జూమ్ యాప్ ద్వారా సమావేశాలు జరుపుతూ, తన అను 'కుల మీడియా ద్వారా అసత్యాలు ప్రసారం చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.

‘జూమ్ మీటింగులకు అలవాటు పడిన ప్రతిపక్షనేత అసెంబ్లీ సమావేశాల్లో లోపలి కంటే బయటే ఎక్కువ గడిపాడు. అను ‘కుల మీడియా కొంగు చాటున దాక్కునే రోజులు పోయాయి. పాలు, నీళ్లను వేరు చేసి చూపే సోషల్ మీడియా ప్రభావశీల ప్రత్యామ్నాయంగా అవతరించిన తర్వాత కట్టు కథలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నాడు’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.

Go Back to Shorts
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News