ఉత్తరప్రదేశ్‌ లో దారుణం.. జర్నలిస్ట్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనం

Journalist set on fire in Uttarpradesh
  • బలరాంపూర్ లో దారుణ ఘటన
  • ఇంటికి  నిప్పంటించిన దుండగులు
  • జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు సజీవదహనం
అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు సజీవదహనం చేశారు. ఈ ఘటన బలరాంపూర్ టౌన్ లో చోటుచేసుకుంది.

రాకేశ్ సింగ్ అనే వ్యక్తి బలరాంపూర్ లో విలేకరిగా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఒక ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో రాకేశ్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు కూడా సజీవదహనం అయ్యాడు. ఘటన జరిగిన సమయంలో రాకేశ్ సింగ్ భార్య, పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులందరినీ పిలిపించుకుని విచారిస్తున్నారు. జర్నలిస్టు భార్యకు పరిహారంగా అధికారులు రూ. 5 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాదు, బలరాంపూర్ షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కేసును దర్యాప్తు చేసేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Go Back to Shorts
Uttar Pradesh
Journalist
Fire

More Telugu News