శర్వానంద్ 30వ చిత్రం షూటింగ్ పూర్తి

Sharwanands latest movie wraps up shoot
  • శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వా 30వ సినిమా 
  • శర్వానంద్ సరసన నాయికగా రీతూవర్మ
  • లాక్ డౌన్ తర్వాత మొదలైన షూటింగ్
  • పూర్తయిందంటూ చిత్రనిర్మాణ సంస్థ ట్వీట్
యంగ్ హీరో శర్వానంద్ ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటాడు. కాస్త వైవిధ్యం వున్న కథలనే ఎంచుకుంటాడు. అందుకే, తన ప్రయాణాన్ని నిదానంగా సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఓపక్క 'శ్రీకారం', 'మహా సముద్రం' సినిమాలను చేస్తూనే.. మరోపక్క తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఇటీవల తమిళంలో కార్తీ హీరోగా 'ఖైదీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే, లాక్ డౌన్ తర్వాత మొదలైన ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఈ రోజు ట్వీట్ చేసింది.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాయడం ఓ హైలైట్ అనే చెప్పాలి. ఇందులో శర్వానంద్ సరసన రీతూవర్మ కథానాయికగా నటిస్తుండగా, ఇతర వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Sharwanand
Ritu Varma
Vennela Kishor

More Telugu News