మమతకు షాక్.. బీజేపీలో చేరనున్న మంత్రి శుభేంద్ర

Shock to Mamata before elections
  • కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన శుభేంద్ర
  • దీదీకి నమ్మకస్తుల్లో శుభేంద్ర ఒకరు
  • అమిత్ షా పర్యటన తర్వాత మారుతున్న పరిణామాలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టుదలగా ఉన్నారు. మరోవైపు బెంగాల్ లో పాగా వేసి సత్తా చాటాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు మమతకు షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి శుభేంద్ర అధికారి త్వరలోనే టీఎంసీని వదిలి బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్ఠానంతో ఆయన టచ్ లో ఉన్నారని సమాచారం. ఈరోజు మమత అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి శుభేంద్ర డుమ్మా కొట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన ముగిసిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

మమతకు అత్యంత నమ్మకస్తులైన వ్యక్తుల్లో శుభేంద్ర కూడా ఒకరు. అలాంటి వ్యక్తి బీజేపీలో చేరబోతున్నారనే వార్త కలకలం రేపుతోంది. మరో ఇద్దరు మంత్రులు రాజీవ్ బెనర్జీ, గౌతమ్ దేవ్ కూడా కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టారు. వీరు కూడా బీజేపీలో చేరబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
Go Back to Shorts
Mamata Banerjee
TMC
Subhendra
Amit Shah
BJP

More Telugu News