లూలూ, అదానీ, టెంపుల్టన్ భూములు లాక్కున్నారు: దేవినేని ఉమ విమర్శలు

devineni uma slams jagan
  • నాడు నారా చంద్రబాబు హయాంలో ఐటీ రాజధానిగా విశాఖజోరు
  • లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి వెళ్లాయి
  • 17 నెలలలో పెట్టుబడులు సున్నా
  • పీపీఏల పునఃసమీక్షతో భారతదేశ పరువు తీశారు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నాడు నారా చంద్రబాబు నాయుడి హయాంలో ఐటీ రాజధానిగా విశాఖజోరు. నేడు లూలూ, అదానీ, టెంపుల్టన్ భూములు లాక్కున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి వెళ్లాయి. 17 నెలలలో పెట్టుబడులు సున్నా. పీపీఏల పునఃసమీక్షతో ప్రపంచ వేదికలపై భారతదేశ పరువు తీశారు. రాజకీయకక్ష సాధింపుకి యువత భవిష్యత్తుని తాకట్టు పెడతారా?’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన పోస్ట్ చేశారు.

విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం అక్కడ విస్తరిస్తున్న ఐటీ అభివృద్ధికి మాత్రం పాతరేసిందని అందులో పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం సీమాంధ్రకు ఐటీ కంపెనీలను రప్పించేందుకు ప్రయత్నించిందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం అసలు ఐటీ రంగం అనేది ఒకటుందనే విషయాన్ని కూడా మరిచిపోయిందని చెప్పింది. దీంతో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా వెళ్లిపోయే పరిస్థితి తలెత్తిందని అందులో పేర్కొంది.
Go Back to Shorts
Devineni Uma
Telugudesam
YSRCP

More Telugu News