కన్నకూతుర్ని పెన్సిలుతో పొడిచి హింసించిన తల్లి.. హెల్ప్ లైన్‌ నంబరుకు మరో కూతురు ఫిర్యాదు!

mother beats daughter
  • కొరికి గాయాలపాలు చేసిన వైనం
  • ఆన్‌లైన్ క్లాసుల్లో ఆన్సర్లు చెప్పట్లేదని కర్కశత్వం
  • ఇంటికి చేరుకున్న ఎన్జీవో ప్రతినిధులు
  • ముంబై, శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
కన్నకూతురిని పెన్సిలుతో 12 సార్లు పొడిచింది ఓ తల్లి, అనంతరం కొరికి గాయాలపాలు చేసింది. దీంతో ఆమె చిన్నకూతురు భయపడిపోయి, ఆ వెంటనే తెలివిగా హెల్ప్ లైన్‌ నంబరుకు ఫోన్ చేసింది. దీంతో  ఎన్జీవో ప్రతినిధులు వారి ఇంటికి చేరుకుని ఆ తల్లికి చివాట్లు పెట్టి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కరోనా నేపథ్యంలో విద్యాలయాలు ఆన్‌లైన్‌ కాస్లులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక ఇంట్లో వర్చువల్ పద్ధతిలో క్లాసులు వింటోంది. ఆ సమయంలో టీచర్ ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ బాలిక సమాధానం చెప్పకపోవడంతో ఆమె పక్కనే ఉన్న తల్లికి కోపం వచ్చి ఇలా కర్కశంగా ప్రవర్తించింది. టీచర్‌ ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదంటూ కన్న కూతురిని దారుణంగా గాయపర్చింది.
Go Back to Shorts
Crime News
Maharashtra
mumbai

More Telugu News