ఏడేళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తున్న లవర్ బోయ్!

Siddharth acting in Telugu movie after 7 years
  • తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న సిద్ధార్థ్
  • 'మహాసముద్రం' సినిమా ద్వారా రీఎంట్రీ 
  • మరో హీరోగా నటిస్తున్న శర్వానంద్
సిద్ధార్థ్... తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. లవర్ బోయ్ గా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తదితర ఎన్నో చిత్రాల్లో నటించి, మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో... గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. కొన్ని తమిళ అనువాద చిత్రాల్లో కనిపించినా... పెద్దగా హిట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలో దాదాపు నాలుగేళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు.

'మహాసముద్రం' చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మరో హీరోగా శర్వానంద్ నటించనున్నాడు. ఈ సినిమాకు ఆర్ఎక్స్100ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సుంకర రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ తమ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సిద్ధార్థ్ కు సంబంధించి వీడియోను పోస్ట్ చేసింది.
Go Back to Shorts
Siddharth
Sharwanand
Mahasamudram Movie
Tollywood

More Telugu News