శర్వానంద్ తదుపరి సినిమాపై ఏకే ఎంటర్టైన్ మెంట్ అధికారిక ప్రకటన

Sharwanand next movie is Mahasamudram
  • శర్వా తదుపరి చిత్రం 'మహాసముద్రం'
  • ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కనున్న చిత్రం
  • దర్శకత్వం వహించనున్న అజయ్ భూపతి
'ప్రస్థానం', 'గమ్యం' వంటి చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన యంగ్ హీరో శర్వానంద్... మరోసారి అలాంటి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. శర్వా తదుపరి చిత్రం 'మహాసముద్రం' పేరుతో రానుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ నిర్మించనుంది.

'ఆర్ఎక్స్100' వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ  చిత్రంలో శర్వాతో పాటు మరో హీరో కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్  అని తెలిపింది.
Go Back to Shorts
Sharwanand
Tollywood
New Movie
Mahasamudram Movie

More Telugu News