ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పెన్మత్స ఏకగ్రీవం

Penmatsa Suryanarayana Raju elected as MLC unanimously
  • రాజ్యసభకు వెళ్లిన మోపిదేవి
  • ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం
  • పెన్మత్స ఒక్కరే నామినేషన్ వేసిన వైనం
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నేత పెన్మత్స సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఓ ప్రకటన చేశారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజు మరణించగా, ఆయన కుమారుడు సూర్యనారాయణ రాజుకు పార్టీ హైకమాండ్ చేయూతనిచ్చింది. ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నిక కోసం పెన్మత్స సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. దాంతో శాసనమండలిలో వైసీపీ బలం 11కి పెరిగింది.
Go Back to Shorts
Penmatsa Suryanarayana Raju
MLC
Unanimous
YSRCP
Andhra Pradesh

More Telugu News