న్యూజిలాండ్ లో మళ్లీ కరోనా కేసులు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని జసిండా

New Zealand announces postponement of elections
  • 102 రోజుల తర్వాత మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు
  • సాధారణ ఎన్నికలను వాయిదా వేసిన ప్రధాని
  • దేశంలో ప్రస్తుతం 78 యాక్టివ్ కేసులు
కరోనాను నియంత్రించిన దేశంగా న్యూజిలాండ్ నిలబడ్డ సంగతి తెలిసిందే. అయితే, దాదాపు 102 రోజుల తర్వాత ఆ దేశంలో మళ్లీ కరోనా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని జసిండా అర్డెర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు.

వాస్తవానికి సెప్టెంబర్ 19న ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఆ ఎన్నికలను అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే  ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కరోనా వల్ల ఆక్లాండ్ లో లాక్ డౌన్ విధిస్తున్నామని చెప్పారు.

మూడు నెలల క్రితం న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా జసిండా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ దేశంలో 1600 వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 78 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
New Zealand
Corona Virus
Elections
Prime Minister
Jacinda Ardern

More Telugu News