ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సిలబస్ 30 శాతం కుదింపు!

AP govt to reduce 30 percent syllabus for students
  • కరోనా కారణంగా ఇంకా ప్రారంభం కాని క్లాసులు
  • ఆన్ లైన్ క్లాసులకు సన్నద్ధమవుతున్న విద్యాశాఖ
  • క్లాసులు జరిగే రోజులు తగ్గనున్న వైనం
కరోనా వైరస్ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే అన్ని పరీక్షలు రద్దైపోయాయి. అంతా సవ్యంగా ఉంటే ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఉండేది. కరోనా కారణంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కాలేదు. దీంతో, ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

ఈ నేపథ్యంలో, ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆగస్ట్ 3 నుంచి వచ్చే ఏడాది మే రెండో వారం వరకు క్లాసులను నిర్వహించాలని సమాలోచనలు చేస్తోంది. క్లాసులు జరిగే రోజులు తగ్గుతుండటంతో... సిలబస్ ను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారు. 2021 మే తొలి వారంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా కేలండర్ సిద్ధం చేస్తున్నారు. మే రెండో వారం నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
online clasess
syllabus

More Telugu News