ఏపీలో మరో 704 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
  • మొత్తం 5,245  మంది డిశ్చార్జ్  
  • ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,770
  • 187 మంది మృతి
  • ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 18,114 శాంపిళ్లను పరీక్షించగా మరో 704 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 648 మంది ఏపీ వాసులు ఉన్నారని వివరించింది. 24 గంటల్లో 258 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 12,202 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 14,595 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 6,770 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 5,245  మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 187కి చేరింది.    

ఏపీలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు..
            
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News