ఏపీలో 24 గంటల్లో 253 మందికి కరోనా పాజిటివ్

New corona cases emerges in AP
  • తాజాగా ఇద్దరి మృతి
  • 84కి పెరిగిన కరోనా మరణాలు
  • 82 మంది డిశ్చార్జి
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 253 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 82 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 84కి పెరిగింది. ఇప్పటివరకు ఏపీలో 4,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,723 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 2,034 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Positive
Deaths
Discharge
Andhra Pradesh

More Telugu News