కరోనా బారిన మరో ‘మహా’ మంత్రి.. ఐసోలేషన్‌లోకి అమాత్యుడు

Maharashtra Minister infected to covid 19
  • మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
  • కరోనా బారిన ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు
  • రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,590 మంది మృతి
మహారాష్ట్రకు చెందిన మరో మంత్రి కరోనా బారినపడ్డారు. దీంతో కరోనా బారినపడిన అమాత్యుల సంఖ్య మూడుకు పెరిగింది. తాజాగా, మహమ్మారి బారినపడిన మంత్రిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. మంత్రి వద్ద పనిచేస్తున్న మరో ఐదుగురు సిబ్బంది కూడా కరోనా బారినపడినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వారిని కూడా ఆసుపత్రులకు తరలించారు.

మరోవైపు, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 3,607 కేసులు నమోదయ్యాయి. అలాగే, 150 మంది కరోనా కాటుకు బలయ్యారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,590 మంది మరణించారు.
Go Back to Shorts
Corona Virus
Maharashtra
Minister
Isolation

More Telugu News