తెలంగాణలో కొత్తగా 99 కేసులు... నలుగురి మృతి

Corona deaths continues in Telangana
  • తెలంగాణలో 92కి చేరిన మరణాలు
  • గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు
  • 12 మంది వలస కార్మికులకు కరోనా
తెలంగాణలో గత 24 గంటల్లో 99 కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. వాటిలో 87 స్థానికంగా వెల్లడైనవి కాగా, వలస కార్మికుల్లో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎప్పట్లానే భారీగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,891 కాగా, 1,273 మంది చికిత్స పొందుతున్నారు. 1,526 మంది డిశ్చార్జి అయ్యారు. కాగా, కొత్తగా మరో నలుగురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 92కు చేరింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Death
Positive
COVID-19

More Telugu News