హీరోగా తొలి సినిమా చేశాక ఏడాది వరకూ ఖాళీగానే ఉండాల్సి వచ్చింది: మురళీ మోహన్

Murali Mohan
  • ఏలూరులో చదువుకునేవాడిని 
  •  నాటకాలు వేసేవాడిని 
  • 'జగమే మాయ'తో తొలి ఛాన్స్ వచ్చిందన్న మురళీ మోహన్
కథానాయకుడిగా .. నిర్మాతగా మురళీమోహన్ ఎన్నో విజయాలను అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. "నేను ఏలూరులోని కాలేజ్ లో చదువుకున్నాను. మొదటి నుంచి కూడా వ్యాపార వ్యవహారాలపైనే దృష్టి ఉండేది. అందువలన చదువు అంతటితో ఆగిపోయింది. అయితే ఆ సమయంలో హీరో కృష్ణగారు .. క్రాంతికుమార్ గారు అదే కాలేజ్ లో చదువుకునేవారు.

చదువు ఆపేశాక విజయవాడలో నేను ఓ బిజినెస్ ను మొదలుపెట్టాను. కాలేజ్ లో నేను సరదాగా నాటకాలు వేసేవాడిననే విషయం క్రాంతికుమార్ కి తెలుసు. ఆయన చెన్నై వెళ్లి 'శారద' సినిమాకి నిర్మాతగా మారాడు. ఆ తరువాత సినిమాను ఆయన నాతో చేస్తానని అన్నాడు. చెన్నై పిలిపించి ఫొటోలు తీయించాడు. ఆ ఫొటోలు చూసిన అట్లూరి పూర్ణచంద్రరావు గారు 'జగమే మాయ' సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో విలన్ గా గిరిబాబు చేశారు. సినిమా విడుదల తరువాత విలన్ గా గిరిబాబు బిజీ అయ్యారు. నేను మాత్రం ఏడాది పాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది" అంటూ నవ్వేశారు.
Go Back to Shorts
Murali Mohan
Giribabu
Kranthi Kumar

More Telugu News