కరీంనగర్‌లో 100 ప్రత్యేక బృందాలతో ఇంటింటికీ వెళ్తూ కరోనా పరీక్షలు

coronavirus cases in karimnagar
  • ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా 
  • వారు పర్యటించిన ప్రాంతంలోని ప్రజలకు వైద్య పరీక్షలు
  • ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారుల సూచన
  • అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధింపు
కరీంనగర్‌ ప్రజలకు కరోనా భయం పట్టుకుంది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ జిల్లాలో మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నారు.

ఇండోనేషియా నుంచి వచ్చిన వారు పర్యటించిన కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఆ ప్రాంతాల ప్రజలు వైద్యులకు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది.

ఆ జిల్లాలో 100 ప్రత్యేక బృందాలతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు ఆ జిల్లాలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించి,  వైద్య సిబ్బందితో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరిన విషయం తెలిసిందే.    
Go Back to Shorts
Karimnagar District
Corona Virus

More Telugu News