తిరుమలలో అంతంతమాత్రంగానే రద్దీ!

Tirumala Rush normal
  • మూడు కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం
  • నిన్న స్వామిని దర్శించుకున్న 60,154 మంది భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రంగా ఉంది. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి గరిష్ఠంగా మూడు గంటల వ్యవధిలోనే దర్శనం పూర్తి కానుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు, రూ. 300 ప్రత్యేక దర్శనం, నడకదారి భక్తుల దివ్యదర్శనాలకు రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. నిన్న సోమవారం నాడు స్వామివారిని 60,154 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 2.67 కోట్ల ఆదాయం లభించింది.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD

More Telugu News