40 ఏళ్ల నాటి నవలలో కరోనా ప్రస్తావన... కాకతాళీయమేనా?

An American novel excerpts Corona like virus 40 years ago
  • 1981లో వచ్చిన ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్
  • అందులో వుహాన్-400 వైరస్ గురించి వివరణ
  • ఇప్పుడు వుహాన్ లోనే మొదలైన కరోనా వైరస్
ప్రపంచవ్యాప్తంగా భయకంపితుల్ని చేస్తున్న కోవిడ్-19 (కరోనా వైరస్) ను పోలిన ప్రమాదకర వైరస్ గురించి 40 ఏళ్ల కిందటే ఓ నవలలో ప్రస్తావించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ నవల పేరు ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్. కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. అమెరికాకు చెందిన డీన్ కూంట్జ్ దీని రచయిత.

ఆ నవలలో... వుహాన్-400 అనే వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు జీవాయుధంగా రూపొందిస్తారు. శత్రుదేశాలపై యుద్ధాల్లో ఉపయోగించేందుకు ఈ జీవాయుధాన్ని చైనా సిద్ధం చేస్తుంది. ఓ మిలిటరీ ప్రయోగశాలలో ఈ వుహాన్-400 వైరస్ ను సృష్టిస్తారు. ఇది మనుషులపై విపరీతమైన ప్రభావం చూపుతుందని, దీన్ని ప్రయోగించడం ద్వారా కొన్ని దేశాలను తుడిచిపెట్టవచ్చని ఆ నవలలో పేర్కొన్నారు.

తాజాగా ఓ నెటిజన్ ఈ నవలలోని అంశాలను వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు కరోనా వైరస్ మొదలైన ప్రాంతం కూడా వుహాన్ కావడంతో ఈ అంశానికి విపరీతమైన ప్రాధాన్యం ఏర్పడింది. అయితే చాలామంది ఇది కాకతాళీయం కావొచ్చని అంటున్నారు. నవలలో పేర్కొన్న వైరస్ సోకితే బతకడం అంటూ ఉండదు. దానితో పోలిస్తే కరోనా తీవ్రత తక్కువేనని, బతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Wuhan-400
The Eyes Of Darkness
China

More Telugu News