ఇటలీలో సందడి చేస్తున్న 'రెడ్'

Red Movie
  • రామ్ .. కిషోర్ తిరుమల నుంచి మరో సినిమా 
  • యూత్ ను ప్రధానంగా చేసుకుని సాగే కథాకథనాలు 
  • ఏప్రిల్ 9వ తేదీన విడుదల
రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' రూపొందుతోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో రామ్ సరసన నాయికలుగా నివేద పేతురాజ్ .. మాళవిక శర్మ .. అమృత కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా టాకీ పార్టును పూర్తిచేసుకుంది.

ప్రస్తుతం పాటల చిత్రీకరణను పూర్తిచేసే పనిలో వున్నారు. ఇటలీలో రెండు పాటలను ప్లాన్ చేశారు. అక్కడి వివిధ లొకేషన్స్ లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు రామ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్లో 'నేను శైలజ'.. 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు వచ్చాయి. 'నేను శైలజ' యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 'రెడ్' సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
Ram
Malavika Sharma
Niveda Pethuraj
Amrutha
Red Movie

More Telugu News